సీఎం కేసీఆర్ వాసాలమర్రి పర్యటనలో ట్విస్ట్..

-

తెలంగాణ సీఎంమ్ కేసీఆర్ వాసాలమర్రి పర్యటన వాయిదా వేసుకున్నారు. కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి హోదాలో పర్యటించనున్నట్లు చెప్పారు. కానీ హఠాత్తుగా ఈ పర్యటన వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పర్యటనకు ఆటంకం కలిగిస్తున్నాయన్న ఉద్దేశ్యంతో ఈ పర్యటన వాయిదా పడింది. నెల రోజుల క్రితమే సీఎం కేసీఆర్ వాసాలమర్రిని పర్యటించారు. 2600మంది గ్రామ ప్రజలతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేసారు.

ఆ సమయంలోనే వాసాలమర్రికి మరో 20సార్లు వస్తానని మాటిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న వాసాలమర్రిని గ్రామాన్ని దత్తత తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆదర్శ గ్రామంగా వాసాలమర్రిని తీర్చిదిద్దేందుకు అద్భివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నారు. ఆ క్రమంలోనే వాసాలమర్రికి మరో 20సార్లు వస్తానని మాటిచ్చారు. ప్రస్తుతం వాయిదా పడిన పర్యటన పూర్తవుతుందో ఇంకా వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news