నిజామాబాద్ యువకుడితో కడప యువకుడి పెళ్లి.. అన్నీ అయిపోయాక దూరం పెట్టడంతో…!

-

మగవాళ్ళను మగవాళ్ళు…ఆడవాళ్ళను ఆడవాళ్ళు ప్రేమించడం పెళ్లి చేసుకోవడం ఇప్పుడు కామన్ గా కనిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా కు చెందిన సాయి కుమార్ అనే యువకుడితో కడప జిల్లా మైదుకూరు యువకుడికి టిక్ టాక్ లో పరిచయం ఏర్పడింది. సాయి కుమార్ దుబాయ్ లో పని చేస్తున్న సమయం లో కడప యువకుడు మస్కట్ లో పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమ గా మారడం తో కడప యువకుడు దుబాయ్ కు షిఫ్ట్ అయ్యాడు. ఆ తరవాత ఇద్దరూ పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కలిసి ఉన్నారు.

Love between two men
Love between two men

ఇద్దరూ ఇండియా కు చేరుకున్న తరవాత తనను దూరం పెడుతున్నాడు అంటూ సాయి కుమార్ ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా తమను కలపాలని యువకుడి గ్రామానికి వెళ్లి సాయి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడు తనతో ఒక విధంగా తల్లి తండ్రులతో ఒకలా మాట్లాడుతున్నాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. న్యాయం చేయకపోతే ఇక్కడే సూసైడ్ చేసుకుంటా అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దాంతో పోలీసులు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news