Union Minister Bhupathi Raju Srinivasa Varma on jagan : జగన్ జైలుకు వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉందన్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ . చట్టం తన పని తాను చేసుకుపోతుంది… జగన్ కి కూడా ఏదో ఒకరోజు టైమ్ దగ్గర పడుతుందని పేర్కొన్నారు . చేసిన దానికి జగన్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు భూపతి రాజు శ్రీనివాస వర్మ.

అమరావతి వేశ్యల రాజధాని అయితే.. జగన్ అంత ఖరీదైన భవనం ఎందుకు నిర్మించుకున్నారు..? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ . ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప వైజాగ్ లో భవనాలు ఎందుకు..? ఆ ని నిలదీశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే వైసీపీ మూడు రాజధానుల నినాదం అన్నారు . నీ కల్ల బొల్లి మాటలను ప్రజలు నమ్మరు… ప్రజలు చాలా తెలివైనవాళ్లు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారనే దానికి 2024 ఎన్నికలు నిదర్శనం అని వెల్లడించారు భూపతి రాజు శ్రీనివాస వర్మ.