జగన్ జైలుకు వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉంది: కేంద్ర మంత్రి

-

Union Minister Bhupathi Raju Srinivasa Varma on jagan :  జగన్ జైలుకు వెళ్లేందుకు ఇంకా టైమ్ ఉందన్నారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ . చట్టం తన పని తాను చేసుకుపోతుంది… జగన్ కి కూడా ఏదో ఒకరోజు టైమ్ దగ్గర పడుతుందని పేర్కొన్నారు . చేసిన దానికి జగన్ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు భూపతి రాజు శ్రీనివాస వర్మ.

jagan , ap, ycp, Union Minister Bhupathi Raju Srinivasa Varma
jagan , ap, ycp, Union Minister Bhupathi Raju Srinivasa Varma

అమరావతి వేశ్యల రాజధాని అయితే.. జగన్ అంత ఖరీదైన భవనం ఎందుకు నిర్మించుకున్నారు..? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ . ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్ప వైజాగ్ లో భవనాలు ఎందుకు..? ఆ ని నిలదీశారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేందుకే వైసీపీ మూడు రాజధానుల నినాదం అన్నారు . నీ కల్ల బొల్లి మాటలను ప్రజలు నమ్మరు… ప్రజలు చాలా తెలివైనవాళ్లు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారనే దానికి 2024 ఎన్నికలు నిదర్శనం అని వెల్లడించారు భూపతి రాజు శ్రీనివాస వర్మ.

Read more RELATED
Recommended to you

Latest news