మంకీపాక్స్ వ్యాక్సిన్ కోసం ముందడుగు : కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ

-

దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. వైరస్​​పై రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. పౌరులెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

 

“మంకీపాక్స్ వంటి వ్యాధుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఇప్పటికే కేంద్రం తరఫున నీతి ఆయోగ్ సభ్యుడి నేతృత్వంలో టాస్క్​ఫోర్స్ ఏర్పాటు చేశాం. టాస్క్​ఫోర్స్ అధ్యయనం చేసిన తర్వాత వారి సలహాలు స్వీకరించి.. తర్వాతి చర్యలు తీసుకుంటాం. కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా.. తప్పకుండా చేస్తాం. ఈ విషయంపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మార్గదర్శనం చేస్తోంది.”

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

‘ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు రావడం ప్రారంభమైనప్పటి నుంచే ముందుజాగ్రత్తలు మొదలుపెట్టాం. కేరళలో తొలి కేసు రావడానికి ముందే మార్గదర్శకాలు విడుదల చేశాం. ప్రయాణికుల స్క్రీనింగ్ రిపోర్టులను సంబంధిత అధికారులకు పంపించాలని విదేశీ ప్రభుత్వాలను కోరాం. ఈ వ్యాధి కొత్తదేం కాదు. 1970ల నుంచి ఆఫ్రికాలో కేసులు నమోదవుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. దేశంలో కూడా పర్యవేక్షణ ప్రారంభమైంది. నిరంతర నిఘాతో వ్యాధిని అదుపులో ఉంచొచ్చు’ అని మాండవీయ పేర్కొన్నారు.

మంకీపాక్స్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. తొలిసారి వైరస్ స్ట్రెయిన్​ను మంకీపాక్స్ నుంచి ఐసీఎంఆర్ వేరు చేసినట్లు చెప్పారు. దీన్ని వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతిపాదనలు సైతం పంపామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news