బ్రేకింగ్ : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కి కరోనా పాజిటివ్

-

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనకు ఈరోజు కరోనా పాజిటివ్ అని తేలింది. “కొన్ని స్వల్ప లక్షణాలను చూపించినప్పుడు, నేను కోవిడ్ పరీక్ష చేయించుకున్నాను, అయితే అందులో పాజిటివ్ అని తేలింది. నేను సెల్ఫ్ ఐసోలేషన్ లోనే ఉన్నాను మరియు వైద్యుల సూచనలు పూర్తిగా అనుసరిస్తున్నాను. నేను అన్ని పనులు వర్చువల్ గా చేస్తున్నాను” అని సిఎం ట్వీట్‌ లో పేర్కొన్నారు.

తన కార్యాలయంలోని కొంతమంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే ఆదిత్యనాథ్ మంగళవారం తనను తాను ఐసోలేట్ చేసుకున్నారు. “నా కార్యాలయంలో కొందరు సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ అధికారులు నాతో సంబంధాలు కలిగి ఉన్నారు, కాబట్టి నేను ముందు జాగ్రత్తగా నన్ను ఐసోలేట్  చేసుకున్నాను మరియు అన్ని పనులు వర్చువల్ గా  ప్రారంభిస్తున్నాను” అని ఆదిత్యనాథ్ హిందీలో చేసిన ఒక ట్వీట్‌ లో నిన్న పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news