యూపీఎస్సీ సివిల్స్-2021 ఫలితాలు.. సత్తా చాటిన తెలుగోళ్లు..!!

-

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. ఈ మేరకు యూపీఎస్సీ సివిల్స్-2021 తుది ఫలితాలను ప్రకటించింది. ఇందులో 685 మంది ఎంపిక అయ్యారు. శృతి శర్మకు మొదటి ర్యాంకు రాగా.. అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు వచ్చింది. మూడో స్థానంలో గామిని సింగ్లా ఉన్నారు.

యూపీఎస్సీ ఫలితాలు
యూపీఎస్సీ ఫలితాలు

కాగా, యూపీఎస్సీ-2021 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్ కుమార్ రెడ్డి (15 ర్యాంకు), పూసపాటి సాహిత్య (24వ ర్యాంకు), కొప్పిశెట్టి కిరణ్మయి (56వ ర్యాంకు), శ్రీపూజ (62వ ర్యాంకు), గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి (69వ ర్యాంకు), ఆకునూరి నరేష్ (117వ ర్యాంకు), అరుగుల స్నేహ (136వ ర్యాంకు), బీ.చైతన్య రెడ్డి (161వ ర్యాంకు), ఎస్.కమలేశ్వర రావు (297వ ర్యాంకు), విద్యామరి శ్రీధర్ (336వ ర్యాంకు).

దిబ్బడ ఎస్పీ అశోక్ (350వ ర్యాంకు), గుగులావర్ శరత్ నాయక్ (374వ ర్యాంకు), నల్లమోతు బాలకృష్ణ (420వ ర్యాంకు), ఉప్పులూరి చైతన్య (470వ ర్యాంకు), మన్యాల అనిరుధ్ (564వ ర్యాంకు), బిడ్డి అఖిల్ (566వ ర్యాంకు), రంజిత్ కుమార్ (574వ ర్యాంకు), పాండు విల్సన్ (602వ ర్యాంకు), బాణావత్ అరవింద్ (623వ ర్యాంకు), బచ్చు స్మరణ్‌రాజ్ (676వ ర్యాంకు).. తదితరులు యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు.

Read more RELATED
Recommended to you

Latest news