ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారుతాయి : సీఎం జగన్‌

-

అమెరికాలో పర్యటించిన ప్రభుత్వ విద్యార్థుల బృందం నేడు సీఎం జగన్‌ ని కలిశారు. ఈ సందర్భంగా అమెరికా పర్యటన వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం. వరల్డ్ బ్యాంక్‌, ఐఎంఎప్‌, కొలంబియా యూనివర్శిటీ, ఇంటర్నేషనల్‌ యూత్‌ కాన్ఫరెన్స్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే.. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అమెరికా పర్యటన ద్వారా మీకు గ్లోబల్‌ ఫ్లాట్‌ఫాం మీద కొన్ని అనుభవాలు నేర్చుకున్నారని, ప్రపంచంతో పోటీ పడితేనే మన బతుకులు మారుతాయన్నారు. దీనికి విద్యే ఆధారమని, మనం జగనన్న విదేశీ విద్యా దీవెన అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్‌. కొలంబియా యూనివర్శిటీ లాంటి చోట్ల 21 కోర్సులు ఇచ్చే అన్ని ప్రఖ్యాత ప్రపంచ కాలేజీల్లో మీకు ఎక్కడ సీటు వచ్చినా ఉచితంగా చదివిస్తామని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా.. ‘విదేశీ విద్యా దీవెన కార్యక్రమం కింద మీకు సీటు వస్తే చాలు రూ.1.2 కోట్ల వరకూ ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. అలాంటి కాలేజీల్లో విద్యాభ్యాసం తర్వాత మీరు సీఈఓలుగా ఎదుగుతారు. ప్రతిభ, నైపుణ్యాలు ఇలాంటి కాలేజీల ద్వారా మీకు అలవడతాయి. అప్పుడు జీవితాలు మారుతాయి. మీకు ఎలాంటి సబ్జెక్టుమీద శ్రద్ధ ఉంది, సంబంధిత ప్రపంచ స్థాయి కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, అందులో సీటు కావాలంటే ఏ రకంగా సన్నద్ధం కావాలన్న విషయాల్లో మీ ఆలోచనల్లో ఉండాలి. జీఆర్‌ఈ, జీ మ్యాట్‌ లాంటి పరీక్షలు కూడా ప్రభుత్వ విద్యార్ధులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశం. ప్రతి విద్యార్థినీ చేయి పట్టి నడిపించడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. విదేశీ విద్యాదీవెన ద్వారా సీటు సాధించడం అన్నది ఈ పిల్లల లక్ష్యం కావాలి. అక్కడ సీటు సంపాదించి చదువులు పూర్తిచే సిన తర్వాత వారి జీవితాల్లో చక్కటి మార్పులు వస్తాయి. టెన్త్‌నుంచి ట్రిపుల్‌ ఐటీ సీటు రావడం అన్నది మీ డ్రీం. అది నిజం అయ్యింది. ఇప్పుడు ట్రిపుల్‌ ఐటీ నుంచి కొలంబియా లాంటి యూనివర్శిటీ లాంటి గొప్ప యూనివర్శిటీల్లో సీటు సాధించడం అన్నది తదుపరి డ్రీం కావాలి. ఇది సాకారమైతే మీ బతుకులు మారడమే కాదు, మీ కుటుంబాల బతుకులు మారడమే కాదు, రాష్ట్ర ప్రతిష్టను కూడా పెంచినవారు అవుతారు.’ అని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news