పవన్ కల్యాణ్‌ను ఫాలో అవుతున్న మరో యంగ్ హీరో..

-

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే చక్కటి విజయం అందుకున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ ఫిల్మ్ సత్తా చాటగా, ఇందులో వైష్ణవ్ తేజ నటన, హావభావాలకు మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీతో వైష్ణవ్ తన మేనమామలు చిరంజీవి, పవన్ కల్యాణ్ ల పేరు నిలబెట్టారనే టాక్ కూడా వచ్చింది. ఈ చిత్రం ద్వారా హీరోకు మాత్రమే కాకుండా హీరోయిన్ కృతిశెట్టికి కూడా మంచి పేరు వచ్చింది.

ప్రజెంట్ కృతి హీరోయిన్ గా దూసుకుపోతున్నది. ఈ సంగతులు పక్కనబెడితే.. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ పవన్ కల్యాణ్ ను ఫాలో అవుతున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం ‘కొండ పొలం’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటలేకపోయింది. కానీ, ఆ చిత్రంలో వైష్ణవ్ నటనా పరంగా ఓకే అని టాక్ వచ్చింది. కాగా, వైష్ణవ్ చేస్తున్న మూడో చిత్రం ‘రంగరంగ వైభవంగా’ కంప్లీట్ గా పవన్ కల్యాణ్ ‘ఖుషి’ ఫిల్మ్ స్టోరి లైన్ లోనే ఉంటుందని తెలుస్తోంది.

Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena
Vijay Sethupathi walks out from Vaishnav Tej Uppena

ఎవర్ గ్రీన్ ఫిల్మ్ ‘ఖుషి’లో ఈగో అనే పాయింట్ పై పవన్ కల్యాణ్, భూమికల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు సినిమాలో హైలైట్ అయ్యాయి. కాగా, ఆ పాయింట్ బేసిస్ లోనే పంజా వైష్ణవ్ తేజ్ ప్రస్తుత సినిమా ఉండబోతున్నదని సమాచారం. ఇందులో పంజా వైష్ణవ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ యాజ్ ఇట్ ఈజ్ గా పవన్ కల్యాణ్ ‘ఖుషి’ సినిమాలో మాదిరిగా ఉండబోతున్నదని టాక్.

స్టోరి ప్రకారం.. వైష్ణవ్ ఇందులో మెడికల్ స్టూడెంట్ గా నటిస్తున్నాడట. ఈ క్రమంలోనే హీరోయిన్ తో లవ్ లో పడటం, ఆ తర్వాత ఈగో కారణంగా క్లాషెస్ రావడం, ఊహించని ట్విస్టులు ఎదరవడం వంటి ఆసక్తికర అంశాలతో స్టోరి ముందుకు సాగుతుందట. మేనమామ పవన్ కల్యాణ్ ఫిల్మ్ ‘ఖుషి’ మ్యాజిక్ ను వైష్ణవ్ తేజ్ సిల్వర్ స్క్రీన్ పై రిపీట్ చేయబోతున్నారా? లేదా అనేది తెలియాలంటే ‘రంగ రంగ వైభవంగా’ ఫిల్మ్ రిలీజ్ డేట్ జూలై 1 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news