క్యాసినోలో జగన్‌ కు, డీజీపీలకు వాటాలు : వంగలపూడి అనిత

-

గుడివాడ క్యాసినో సీఎం జగన్‌, ఏపీ డీజీపీలకు వాటా ఉందని వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పెరు చేబితే మొన్నటి వరకు గంజాయి, డ్రగ్స్ అని.. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ పెరు చెబితే గుడివాడ , అందులో క్యాసినో గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు సూపర్ సీఎం జగన్ అని… కానీ కొడాలి నాని గారు మాత్రం కరోనా తో హైదరాబాద్లో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాను అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినిమా టిక్కెట్ పది రూపాయాలు చేశారు..క్యాసినో మాత్రం 10వేలు టికెట్ పెట్టారు. దీనిని కూడా పేదలకు అందుబాటులో తెస్తారా…? అని నిప్పులు చెరిగారు. సీఎం జగన్ ఉండే తాడేపల్లి కూత వేటు దూరంలో ఉన్న నోరు ఎందుకు విప్పరు అని నిలదీశారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే… తాడేపల్లి సీఎం జగన్ ఇంటిని కూడా ముట్టడి చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. తాడేపల్లి ప్యాలెస్ కు ఎంత వాటా వెళ్ళింది.? క్యాసినో వ్యవహారం లో డిజిపి కి వాటా వెళ్ళింది.? అంటూ ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news