తెలంగాణలో ఏం పీకడానికి వచ్చావు.. అమిత్ షా ? : మంత్రి ప్రశాంత్ రెడ్డి

-

నిన్న తెలంగాణకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాకు ప్రశాంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణలో ఏం పీకడానికి వచ్చావని.. అమిత్‌ షా ను నిలదీశారు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణకు నువ్వేమిచ్చామో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనేందుకే బండి సంజయ్ చాలన్న అమిత్ షా.. తెలంగాణలో ఏం పీకడానికి వచ్చాడు ? అని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రాష్టానికి అప్పులు ఎందుకు ఇవ్వరని… వాళ్ళ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా ? అని నిలదీశారు. దేశంలోని సంపదను ఆదాని, అంబానీలకు మోడీ దోచి పెడుతున్నారని.. మేము పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని వెల్లడించారు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి.

కేసీఆర్ పేదలు ఆత్మ గౌరవంతో ఉండేలా ఇండ్లు నిర్మించాలని కలలు కన్నారన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం కేసీఆర్ చేశారని.. కేసీఆర్ కలలను సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటామంటే నష్ట పోతారు. చాలా పారదర్శకంగా ఇల్లు లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news