‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్..!

-

ప్రముఖ బాలీవుడ్ లెజెండరీ నటి సురేఖా సిక్రి అనారోగ్యం బారినపడ్డారు. ఈమె వయసు 75 సంవత్సరాలు. ఉన్నట్లుండి ఈమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఆమెకు స్ట్రోక్ రావడం ఇది రెండోసారి. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలిపారు వైద్యులు. ప్రస్తుతం వైద్యులు ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే 2018లో ఈమె నటించిన ‘బధాయి హో’ సినిమా విడుదల సమయంలో ఈమెకు తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అయితే క్రమంగా దాని నుంచి క్షేమంగా బయట పడిన ఈమె.. మళ్ళీ ఇప్పుడు అనారోగ్యం పాలయ్యారు.

అలాగే నెట్‌ఫ్లిక్స్ హారర్ ఆంథాలజీ ‘ఘోస్ట్ స్టోరీస్‌’లో జాన్వీ కపూర్‌తో కలిసి నటించింది సురేఖా సిక్రి. ‘తమస్’ (1988), ‘మమ్మో’ (1995), ‘బధాయి హో’ (2018) సినిమాలకు జాతీయ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. ఈమె చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. చిన్నారి పెళ్ళికూతురు బామ్మ అనే ఈమని గుర్తుపట్టని వారు ఉండరు.

Read more RELATED
Recommended to you

Latest news