క్రేజీ డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో ఫ్యాన్స్ హ్యాపీ..!!

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా అవతరిస్తారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ, పూరీ జగన్నాథ్ పాన్ ఇండియా టార్గెట్ మిస్ ఫైర్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లైగర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా, ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వచ్చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమా కోసం క్రేజీ డైరెక్టర్ కు ఓకే చెప్పారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే లవ్ స్టోరి చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి నటించనున్నారు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జన గణ మన(జేజీఎం)’ చేయనున్నారు. ఇందులో హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేను ఫైనల్ చేసింది మూవీ యూనిట్.

‘ఖుషి’ షూటింగ్ పూర్తి కాగానే ‘జన గణ మన’ షూటింగ్ కు పూరీ జగన్నాథ్ ప్లాన్ చేస్తారని సమాచారం. లవ్ స్టోరి అయిన ‘ఖుషి’ డెఫినెట్ గా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ను అలరిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతులు అలా పక్కనబెడితే..విజయ్ దేవరకొండ .. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన దర్శకుడు హరీశ్ శంకర్ తో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట.

గతంలో విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి తాను ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు హరీశ్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు. హరీశ్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘భవదీయుడు భగత్ సింగ్’ ఫిల్మ్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. ఆ పిక్చర్ పూర్తయిన తర్వాత హరీశ్ శంకర్.. విజయ్ దేవరకొండతో ఫిల్మ్ చేస్తారని టాక్. ఈ కాంబో కోసం టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గతంలో ట్రై చేశారని వినికిడి. చూడాలి మరి.. భవిష్యత్తులో వీరి కాంబినేషన్ లో ఫిల్మ్ వస్తుందో లేదో..

Read more RELATED
Recommended to you

Latest news