రైతులకు గుడ్ న్యూస్… పెరగనున్న విజయడెయిరీ పాల సేకరణ ధరలు

-

పాడి రైతులకు గుడ్ న్యూస్. పాల సేకరణ ధరలు పెరగనున్నాయి. విజయ డెయిరీ పాల సేకరణ ధరలను పెంచుతూ.. నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన తెలంగాణ ప్రభుత్వం ముందర ఉంది. ఇప్పుడు ఉన్న పాలసేకరణ ధరలకు అదనంగా లీటర్ కు మరో రూ. 4 పెంచాలని ప్రభుత్వాన్ని విజయ డెయిరీ చైర్మన్ భూమారెడ్డి కోరారు. అయితే ప్రభుత్వం లీటర్ పై రూ. 2 పెంచాలని భావిస్తోంది. ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ప్రస్తుతం పెరిగిన ధరలు, ఖర్చులకు అనుగుణంగా పాల సేకరణ ధరను పెంచాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బర్రె పాలు లీటర్ కు రూ. 40- రూ. 45, ఆవు పాలకు రూ. 28 వరకు చెల్లిస్తున్నారు. అయితే బర్రె పాలకు రూ. 55, ఆవు పాలకు రూ. 35 చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పాలసేకరణ ధరలు పెరిగితే కొంతలో కొంత రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news