ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? – విజయసాయిరెడ్డి

-

టిడిపి అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు ఏం పని? అని ప్రశ్నించారు. వేల ఎకరాల ఆ స్వామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడని ప్రశ్నించారు.

“ఉత్తరాంధ్రలో చంద్రంకు ఏం పని? వేల ఎకరాల ఆసామి గీతం మూర్తి ఎక్కడి నుంచి వచ్చాడు? వంగవీటి రంగా హంతకుడు వెలగపూడి విశాఖ ఎందుకొచ్చాడో చెప్పు. డ్రామోజీ డాల్ఫిన్ హోటల్ కట్టినప్పుడు నోరెందుకు లేవలేదు? వీళ్లంతా మిడతల దండులా వచ్చి విశాఖలో 80% భూములు ఆక్రమిస్తే ‘కమ్మ’గా ఉందర్రా కూనా?” అని ట్విట్ చేసిన ఆయన.. మరో ట్వీట్ చేస్తూ.. “ముసలి చంద్రం నాయుడు, ఆయన దొంగల ముఠా కళ్లన్నీ విశాఖ వనరుల మీదనే. పేదలు వలస పోతుంటే ఆనందించారు. పరిశ్రమలు పెడతామని వస్తే బాబు అమరావతికి రమ్మనేవాడు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆయన హయాంలోనే బీజం పడింది. రక్షకులెవరో, భక్షకులేవరో ప్రజలకు తెలుసు” అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news