టీడీపీ-బీజేపీలకి విజయసాయి రెడ్డి పంచ్..!

-

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను మరోసారి టార్గెట్ చేసారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ‘నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది’ అని ట్వీట్ చేసారు.

అలాగే ‘ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుని పేదలపై పగ సాధించడమే కాకుండా దొంగే దొంగ, దొంగ అని అరిచినట్టు నిరసన దీక్షలు చేస్తారట టీడీపీ(తెలుగు దొంగల పార్టీ)నేతలు. పట్టాల పంపిణీ వాయిదా వేయకుండా తక్షణమే అందజేయాలని డిమాండు. అడ్డుకునేది మీరే. ఇవ్వాలని అడిగేది మీరే. మరీ ఇంత సిగ్గు విడిచి రాజకీయం చేయాలా’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news