2024లో ఖాండ్రించి టీడీపీపై ‘ఉమ్ముతారు’ – విజయసాయిరెడ్డి సంచలనం

-

తెలుగు దేశం పార్టీపై వైసీపీ నేత, రాజ్య సభ సభ్యులు విజయసాయి రెడ్డి సంచటన ట్వీట్‌ చేశారు. 2024లో టీడీపీపై ఖాండ్రించి ‘ఉమ్ముతారు’ అని అన్నారు. ఎల్లో మీడియా, బాబు భజన బృందాలు విషం చిమ్ముతూనే ఉంటాయని ఫైర్ అయ్యారు. కాలకూట విషానికి విరుగుడు లేదన్న ధీమా వారిదని… సంక్షేమ రాజ్యంలో నిశ్చింతగా ఉన్న జనం ‘నవ్వుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.

తర్వాత ‘చిరాకు’ పడతారు. 2024లో ఖాండ్రించి ‘ఉమ్ముతారు’ అని… అదే మీకు Anti venom. కోరలు లేని సర్పాలు చలి చీమలకు ఆహారమవుతాయని నిప్పులు చెరిగారు విజయసాయి రెడ్డి.

ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని తిట్టేంచేందుకు ‘గుంట నక్కలను’ చంద్రబాబు ఉసిగొల్పుతున్నాడని… వాటి ఊళలకు సంబరపడే ‘నార్సిసిస్టిక్’ రుగ్మత (Narcissistic disorder) జిగురులా పట్టుకుందని మండి పడ్డారు. అభద్రతా భావాన్ని ఎగదోసి ‘బుసలు’ కొట్టించడం, ఓటమిని గెలుపు అనుకోవడం దీని లక్షణం. వృద్ధాప్యంలో ఇదో దీనావస్థ అంటూ మరో ట్వీట్‌ లో విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news