జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా కొనసాగాలి – విజయసాయిరెడ్డి

-

జగన్ మరో 30 ఏళ్లు సీఎంగా ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. నేడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ 50వ జన్మదినం. అయితే, సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు.

దీనిలో భాగంగా ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటనుండగా, రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలను నిర్వహించనుంది. ఇక ఈ నేపథ్యంలోనే జగన్‌ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు విజయసాయిరెడ్డి.

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరానికి చేర్చేందుకు ఆయన పడుతున్న శ్రమకు ప్రజలందరి ఆశీస్సులు అపారంగా ఉండాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా. మరో 30 ఏళ్లపాటు ఆయనే సిఎంగా కొనసాగాలి. దేశమంతా రాష్ట్రం వైపు చూడాలంటూ ట్వీ ట్‌ చేశారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news