నందమూరి ఫ్యామిలీపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ !

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి… ఎప్పుడూ… తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టార్గెట్‌ చేస్తూ ఉంటారు. అయితే.. మొన్న చంద్రబాబు కంటతడి పెట్టుకున్న ఎపిసోడ్‌ పై… మరోసారి విజయసాయిరెడ్డి సెటైర్‌ వేశారు. అంతేకాదు.. చాలా అమాయకులు అంటూ నందమూరి ఫ్యామిలీపై కామెంట్‌ చేశారు.

ysrcp mp vijayasai reddy

” సింపతీ గేమ్ లో చంద్రబాబు ఈవెంట్ మేనేజ్ మెంట్ స్కిల్స్ మరింత పదును తేలాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో సంస్కారం, పెంపకాల మీద ప్రెస్ మీట్లు పెట్టించాడు. వాళ్లు అమాయకులు కాబట్టే వెన్నుపోటు పొడిచావ్. ఆరోజున పెద్దాయనను గాలికొదిలేసి, నీ వెంట నడిచింది వీళ్లే కదా?” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

”చంద్రబాబు ఏం చేసినా రాజకీయ లాభనష్టాలు ముందే అంచనా వేసుకుంటాడు. గుళ్లను కూల్చాడు, రథాలు తగలబెట్టించి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూసి భంగపడ్డాడు. చివరకు తన కుటుంబాన్ని తానే బజారున పడేసుకున్నాడు. ఇది పక్కా రాజకీయ విన్యాసం తప్ప ప్రతిష్టకు సంబంధించిన అంశమే కాదు.” అంటూ మరో ట్వీట్‌ లో పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version