తెలంగాణ మరో శ్రీలంక కాబోతుంది – విజయశాంతి

-

తెలంగాణ మరో శ్రీలంక కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కేసీఆర్ తెలంగాణను ఆగం చేస్తుండు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిండు. తాజాగా తెలంగాణ ఆదాయం పెరుగుతున్నట్లు కేసీఆర్ సర్కార్ చెప్తున్నప్పటికీ.. స్కీమ్​లు అమలు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, నెలనెలా జీతాలు ఇయ్యాలన్నా, చివరికి పాత అప్పులకు వడ్డీలు కట్టాలన్నా మళ్లా అప్పులే చేయాల్సి పరిస్థితి వస్తున్నదని పేర్కొన్నారు.

అక్టోబర్​ నుంచి డిసెంబర్​ వరకు మూడు నెలల్లో… రూ. 8,578 కోట్ల అప్పు కావాలని రిజర్వు బ్యాంక్​ను కేసీఆర్ సర్కార్ కోరింది. నెలల వారీగా ఎంతెంత అప్పు కావాలనే ఇండెంట్‌ను ఇటీవలే ఆర్బీఐకి సమర్పించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు వారాలకోసారి రిజర్వు బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలం ద్వారా ఈ కొత్త అప్పు తెచ్చుకోనుందని వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్​ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 19,500 కోట్ల అప్పు తీసుకుంది. కొత్తగా తీసుకుంటున్న అప్పుతో… ఇది రూ. 28 వేల కోట్లు దాటనుంది. ఎనిమిదేండ్లుగా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయటంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇలానే ఉంటే ఈ కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణను ఆగం చేస్తున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం కచ్చితంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news