ఖమ్మంలో బిఆర్ఎస్ బహిరంగ సభపై విజయశాంతి కీలక వ్యాఖ్యలు

-

జాతీయ పార్టీగా అవతరించిన భారత్ రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ ని ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొంటున్నారు. ఈ సభకి దాదాపు 5 లక్షల మంది వస్తారని ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరై విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, పలువురు జాతీయ నేతలు ఈ సభకి హాజరుకానున్నారు.

అయితే ఈ సభపై బిజెపి నేత విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. “దేశంలోనే అత్యంత అవినీతిపరులైన సీఎం కేసీఆర్ గారికి… వామపక్ష పార్టీలు, ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పుకునేవారు మద్దతిచ్చి, నేటి ఖమ్మం సభలో ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో వారికే తెలియాలి. అయినా ఈ లిక్కర్ స్కాంల, లిక్కర్ స్కీంల తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కమ్యూనిస్ట్‌లు ఎందుకో అవసరం లేని సయోధ్య, తమ సిద్ధాంతాలకు దూరమై కనపరుస్తున్నారని అనిపిస్తున్నది”. అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news