అఫీషియల్: RRRకు సీక్వెల్.. విజయేంద్రప్రసాద్ ప్రకటన..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. అతి త్వరలో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుందని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

vijayendraprasad
vijayendraprasad

ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ ఉండాలని మెగా, నందమూరి అభిమానులు, సినీ లవర్స్, నెటిజన్లు కోరుకున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెట్టారు. కాగా, తాజాగా ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యలో ‘ఆర్ఆర్ఆర్ ’ఫిల్మ్ స్టోరి రైటర్ విజయేంద్రప్రసాద్ సీక్వెల్ పై క్లారిటీనిచ్చారు.

RRR పిక్చర్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా సినిమా అత్యద్భుతమైన విజ్యువల్ వండర్ లా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ తో పాటు మూవీలో ఎమోషనల్ సీన్స్ ఎలివేషన్స్, హీరోల ఇంట్రడక్షన్స్ సీన్స్ హైలైట్ గా నిలిచాయని అంటున్నారు. ఈ క్రమంలోనే సీక్వెల్ ఉండాలని అంటున్న అభిమానుల ఆశలపై విజయేంద్రప్రసాద్ స్పష్టమైన ప్రకటన ఇచ్చారు.

‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ గురించి చర్చ జరిగిందని, జూనియర్ ఎన్టీఆర్ తనకున్న ఐడియాలను తమతో పంచుకున్నాడని, తాను, రాజమౌళి విన్నామని విజయేంద్రప్రసాద్ చెప్పాడు. ఈ క్రమంలోనే సీక్వెల్ కు పాజిబిలిటీస్ ఉన్నాయని, అందుకు తగిన కథను రాసుకున్నాక సీక్వెల్ ఉండబోతున్నదని చెప్పకనే చెప్పేశాడు రాజమౌళి ఫాదర్. అలా విజయేంద్రప్రసాద్ మెగా, నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నేపథ్యంలో సీక్వెల్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పాత్రలు ఎలా ఉండబోతాయని ఇప్పటి నుంచే ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news