OTTలోకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు యంగర్ హీరో కిరణ్ అబ్బవరం. వైవిద్యమైన కంటెంట్​తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలా ఈ హీరో తాజాగా నటించిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. నైబర్ నెంబర్స్ అనే కాన్సెప్ట్​తో ఫిబ్రవరి 18న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. థియేటర్​లో మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు.

వారి నిరీక్షణకు తెరపడింది. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం ఉగాది కానుకగా మార్చి 22న ఓటీటీ ‘ఆహా’లో విడుదలవుతుందని నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ ప్రకటించింది. కిరణ్‌ అబ్బవరం, కశ్మీరా పరదేశి జంటగా నటించిన ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద మంచి స్పందన లభించింది. పలు నేపథ్యాల మిళితంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించారు. శుభ‌లేఖ సుధాక‌ర్‌, ముర‌ళీ శ‌ర్మ‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Latest news