Virata Parvam : ఓటీటీలో రానా విరాటప‌ర్వం.. భారీ ధ‌ర‌కు డీల్!

-

టాలీవుడ్ స్టార్ హీరో రానా, సాయి ప‌ల్ల‌వి హీరో, హీరోయిన్లుగా చేసిన సినిమా విరాట ప‌ర్వం. వేణు ఊడుగులు ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమా గ‌త ఏడాదే థీయేట‌ర్ ల‌లో విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా వైర‌స్ వ్యాప్తి, థీయేట‌ర్స్ పై ఆంక్షల‌తో వాయిదా పడుతూ వ‌స్తుంది. అయితే గ‌తంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుద‌ల చేయనున్నార‌నే వార్తలు వ‌చ్చాయి. అయితే అప్పుడు చిత్ర బృందం స్పందించి థీయేట‌ర్స్ ల్లోనే విరాట ప‌ర్వం సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

లాక్ డౌన్ ఎత్తేవేసి, థీయేట‌ర్స్ పై ఆంక్షలు తీసివేసి చాలా రోజులు అవుతున్నా.. ఈ సినిమాను ఇంకా విడుద‌ల చేయ‌డం లేదు. తాజా గా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తున్న‌ట్టు మ‌రో సారి వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం థీయేట‌ర్స్ ల‌లో ఎక్కువ సినిమాలు ఉన్నాయ‌ని.. అందుకోసం విరాట ప‌ర్వం సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే విరాట ప‌ర్వం సినిమాకు ఒక ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ కూడా ముందుకు వ‌చ్చినట్టు స‌మ‌చారం. రూ. 50 కోట్లతో విరాట ప‌ర్వం హ‌క్కుల‌ను సొంతం చేసుకోవాల‌ని చ‌ర్చ‌లు కూడా జ‌రుపుతుంద‌ని తెలుస్తుంది. అయితే దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక స‌మాచారం రాలేదు. కానీ అతి త్వ‌ర‌లోనే దీనిపై చిత్ర బృందం అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news