కరోనా 2.0.. వాయిదా పడిన విరాట పర్వం.. కొత్త తేదీ ఎప్పుడంటే,

-

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాట పర్వం చిత్రం ఈ నెల ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవ్వాల్సి ఉంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు మొదలెట్టేసారు కూడా. టీజర్, పోస్టర్లతో ప్రేక్షకుల్లో మంచి హైప్ తీసుకురాగలిగారు. ఐతే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, సినిమా విడుదలకి ఇబ్బంది కలిగేలా ఉంది. కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జనాలు సినిమాలకి వస్తారా అన్న సందేహం ఉంది. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ రోజు రోజుకీ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది.

అందువల్ల సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 30వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతుందని, తదుపరి విడుదల తేదీని కొన్ని రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్న విరాటపర్వం సినిమా పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. నక్సలిజం నేపథ్యంలో సాగే ఈ కథలో అందమైన ప్రేమకథ ఉందని తెలుస్తుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news