విరాట్ కోహ్లీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వీరేంద్ర సెహ్వాగ్

-

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు సౌరవ్ గంగూలీ చేసిన దానితో పోలిస్తే విరాట్ కోహ్లీ చేసింది చాలా తక్కువ అని చెప్పాడు. కెప్టెన్ గా గంగూలీ.. కొత్త భారత జట్టును నిర్మించాడని, కానీ కోహ్లీ అలా చేశాడా..? అని ప్రశ్నించాడు. ఓ క్రీడా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సెహ్వాగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు అంగీకరిస్తూ ఉంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

“గంగూలి కొత్త భారత జట్టును నిర్మించాడు. ఎంతో మంది యువ ఆటగాళ్లను జట్టులో కి తీసుకొచ్చాడు. ఆటగాళ్లు ఉన్నంతగా ఆడినప్పుడు అయినా.. ఫాం లో లేనప్పుడైనా వారికి మద్దతుగా నిలిచే వాడు. విరాట్ కోహ్లీ సారథి గా ఉన్నప్పుడు అలా చేశాడా..? “ఏమో నాకు డౌటే” అని వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగని సెహ్వాగ్ నా అభిప్రాయం ప్రకారం నెంబర్వన్ కెప్టెన్ అనే వ్యక్తి జట్టుని నిర్మించడమే కాక జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నమ్మకం కల్పించాలి. కోహ్లీ కొంత మంది ఆటగాళ్ల కే మద్దతుగా నిలిచాడు. చాలా మందిని అతడు పట్టించుకోలేదు అని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news