వీరేంద్ర సెహ్వాగ్ సోదరి ఆప్‌లో చేరిక

-

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ శుక్రవారం ఆమ్ అద్మీ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. 2012లో మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్‌పై దక్షిణ్‌పురి ఎక్సటెన్షన్ స్థానం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశారు.

వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ ఆప్‌లో చేరారు. ఆమె మాజీ కాంగ్రెస్ కౌన్సిలర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పనితీరు పట్ల ప్రభావితమై ఆప్ మద్దతుదారులలో చేరారు అని శుక్రవారం ట్విట్టర్‌లో ఆప్ అధికారిక ఖాతాలో వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news