నరేందర్ కుటుంబానికి అండగా ఉంటాం – ఎమ్మెల్సీ కవిత

-

జగిత్యాల పట్టణంలో శనివారం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. టిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా కొత్త బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట బిఆర్ఎస్ నాయకులు నృత్యాలు చేస్తుండగా మహిళా కౌన్సిలర్ బండారి రజని భర్త బండారి నరేందర్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. నాయకులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

దీంతో తోటి నాయకులు, కౌన్సిలర్లు విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో బండారి నరేందర్ నివాసానికి వెళ్లి ఆయన పార్టీవదేహానికి నివాళులు అర్పించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నరేందర్ అకాల‌ మరణం అత్యంత విచారకరం అన్నారు. నిరంతరం పార్టీ బలోపేతం కోసం, రైతు సంక్షేమం కోసం పాటుపడిన నరేందర్ సేవలు మరువలేనివని.. నరేందర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా నిలుస్తాం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news