బైరి నరేష్ పై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తాం – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

-

హిందూ దేవుళ్ళపై, అయ్యప్ప స్వామి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై పిడియాక్ట్ పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హిందూ సమాజాన్ని కించపరించెలా వాక్యాలు చేసిన బైరి నరేష్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప మాల ధారణ అత్యంత పవిత్రమైనదని.. గత 25 సంవత్సరాలుగా అయ్యప్ప మాల వేసుకుంటున్నానని తెలిపారు.

అయ్యప్ప స్వామిని, మాల వేసుకునే అయ్యప్ప స్వాములను కించపరచడం దారుణం అన్నారు మాధవరం కృష్ణారావు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన బైరి నరేష్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలన్నారు. ఎవరు కూడా ఏ మతాన్ని, కులాన్ని ఉద్దేశించి ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. బైరి నరేష్ పై త్వరలోనే రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news