West Bengal: వరసగా మోడల్స్ ఆత్మహత్యలు… 13 రోజుల్లో నలుగురు బలవన్మరణం

-

బెంగాల్ లో వరసగా మోడల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరసగా బలవన్మరణాలకు పాల్పడుతుంటం బెంగాల్ లో చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 13 రోజుల్లో నలుగురు మోడల్స్ తమ నివాసాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో బెంగాల్ గ్లామర్ ఫీల్డ్ లో ఆందోళన ఏర్పడింది. తాజాగా ఆదివారం సరస్వతి దాస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోల్​కతా కస్బా ప్రాంతంలోని తన నివాసంలో ఆదివారం మోడల్​ సరస్వతీ దాస్​ విగతజీవిగా కనిపించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి డెడ్ బాడీపై ఎలాంటి గాయాలు లేవని… పోస్ట్ మార్టం అనంతరం చనిపోవడానికిగల కారణాలు తెలిసే అవకాశం ఉందని అన్నారు. 

ఇప్పటి వరకు బెంగాల్ లో వరసగా పల్లబిడే, బిదిషా డీ మజుందార్, మంజూషా నియోగి వరసగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇందులో బిదిషా మజుందార్ కు అవకాశాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. బిదిషా మరణం వేధించడంతో తీవ్ర డిప్రెషన్ కు వెళ్లిన మరో మోడల్ మంజూషా నియోగి ఆత్మహత్య చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news