తెలంగాణ కు.ని ఆపరేషన్లపై WHO విచారణ

-

తెలంగాణ కు.ని ఆపరేషన్లపై WHO విచారణ చేపట్టనుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణ చేపట్టింది. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీ రావు ఆధ్వర్యంలో వైద్య బృందం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రి సందర్శించింది.

గత నెల 25న జరిగిన ఆపరేషన్లపై వైద్యుల నుంచి బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్న డబ్ల్యూహెచ్ఓ… శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన ఆపరేషన్ పరికరాల పరిశీలన చేసింది. పరికరాలు ఎలా స్టెరిలైజ్ చేశారు, ఆపరేషన్ థియేటర్లో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్న విచారణ అధికారులు.. ఆపరేషన్లు జరిగిన అనంతరం మహిళలను ఇంటికి పంపే ముందు వాడిన మందుల వివరాల సేకరణ చేశారు. కు.ని వికటించిన ఘటనపై నివేదికను జాతీయ ఆరోగ్య సంస్థకు పంపిస్తామని విచారణ అధికారులు పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news