వేరే మగాడితో మాట్లాడొద్దన్నాడని.. తల్లితో కలిసి భర్తను చంపిన భార్య

-

మతాలు వేరైనా మనసుపడిన వాడిని మనువాడింది. కొన్నిరోజుల సఖ్యంగా ఉన్న ఆ భార్యాభర్తలు ఇటీవల తరచూ గొడవపడుతున్నారు. భార్య ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడటం గమనించిన భర్త ప్రవర్తన మార్చుకోవాలని మందలించాడు. అతడిపై కోపం పెంచుకున్న భార్య.. తల్లితో కలిసి అతడిని మట్టుపెట్టాలనుకుంది. తల్లీకూతుళ్లు కలిసి ఆ వ్యక్తి గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో చోటుచేసుకుంది.

ఆటోనగర్‌లో నివసిస్తున్న అజీంఖాన్‌(33) అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరు అత్త నర్మద (శ్రావణి తల్లి) ఇంట్లోనే నివసిస్తున్నారు. కుమారులు హమాన్‌(6), హర్మాన్‌(8)లను పాఠశాలకు పంపించి శ్రావణి కృష్ణానగర్‌లోని ఓ సంస్థలో పనికి వెళ్తోంది. ఆమె రోజూ ఫోన్లో మాట్లాడుతూ పనికి వెళ్తుండటాన్ని గమనించిన అజీంఖాన్‌ అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాడు. దీనిపై మంగళవారం సాయంత్రం ఇంటి బయటే భార్య, అత్త అతడితో గొడవకు దిగారు.

అనంతరం శ్రావణి, నర్మదలు ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లి గొంతు నులిమేయడంతో కిందపడి పోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. మృతుని సోదరుడు నదీమ్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు భార్య, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news