ఇండియా వెరీ డేంజర్ టీం, ఆపడం ఎవరి తరం కాదు: కెప్టెన్ విలియమ్సన్

-

గత రాత్రి ముంబై లో ఇండియా మరియు న్యూజిలాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అన్ని విభాగాలలో రాణించి ఘనవిజయాన్ని సాధించి గర్వంగా ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా తరపున కోహ్లీ , అయ్యర్ లు సెంచరీ లతో చెలరేగి భారీ టార్గెట్ కివీస్ ముందుంచగా, కివీస్ ను షమీ తన పదునైన బంతులతో ఏకంగా 7 వికెట్లు తీసి ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఇండియా ఉన్న ఫామ్ ను ఆపడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. ఇండియా చాలా డేంజర్ టీం ఈ వరల్డ్ కప్ లో ఓడించే టీం లేదంటూ అందరికీ హెచ్చరికను జారీ చేశాడు విలియమ్సన్. తమలోని ఆత్మవిశ్వాసమే వరుసగా విజయాలు సాధించడానికి ప్రధాన కారణం అంటూ విలియమ్సన్ ఇండియా టీం ను పొగడ్తలతో ముంచెత్తాడు విలియమ్సన్.

ఖచ్చితంగా రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా కప్ ని సాధిస్తుంది అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు విలియమ్సన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version