కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ను పరిగణలోకి తీసుకుంటాం : సుప్రీంకోర్టు

-

డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం సార్వత్రిక ఎన్నికల కారణంగా సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌పై విచారణ చేయవచ్చని పేర్కొంది.

అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని జస్టిస్ ఖన్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని కోరారు. అయితే, న్యాయస్థానం దాని గురించి బహిరంగంగానే ఉందని బెంచ్ న్యాయవాదులకి వార్నింగ్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా ఇవ్వకపోవచ్చు, కానీ అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి సిద్ధంగా కోర్టు ఉందని తెలిపింది.కేసును మే 7కి వాయిదా వేసింది. కేజ్రీవాల్ ఏదైనా ఫైల్‌పై సంతకం చేయాలా అని ఈడీని ప్రశ్నించింది కోర్టు.కేజ్రీవాల్ ను ఇతర ప్రశ్నలు అడిగిన ధర్మాసనం, ఈ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ తేదీన సమాధానం ఇవ్వాలని ఈడీని కోర్టు కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version