ఫోన్‌తో స్కాన్‌ చేసి ఏటీఎం నుంచి డబ్బులు పొందొచ్చు.. వివరాలు ఇవే..!

-

ఇక కార్డు లేక పోయిన ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. మామూలుగా అయితే మనం ఏటీఎం కి వెళ్లి డెబిట్ కార్డు పెట్టి, పిన్ ఎంటర్ చేసి ఇలా డబ్బుల్ని పొందుతాం. అయితే ఇలానే కాకుండా డెబిట్ కార్డు లేక పోయినా కూడా యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. చాల మందికి ఈ సర్వీసు గురించి తెలీదు. కానీ దీని వలన మంచి బెనిఫిట్స్ వున్నాయి.

 

ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే.. యూపీఐ యాప్‌ను ఓపెన్ చేయాలి. భీమ్, పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే, అమెజాన్ వంటి యాప్స్‌ను ఓపెన్ చెయ్యాలి. ఆ తరువాత ఏటీఎంపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి… ఎంత డబ్బులు తీసుకోవాలో ఎంటర్ చేస్తే చాలు. దీని ద్వారా రూ.5 వేల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రొసీడ్‌ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి అంతే.

ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ ఆపరేబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులను తీసుకు రానుంది. అయితే ఈ కొత్త సేవల వలన యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏటీఎం నుంచి డబ్బులు పొందొచ్చు.

ఇది ఇలా ఉండగా సిటీ యూనియన బ్యాంక్ ఇప్పటికే ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఏటీఎం సేవలు ఈ బ్యాంక్ కస్టమర్లకు తొలిగా అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడుతోంది. అయితే ఈ బ్యాంక్ 1500 ఏటీఎం‌లను కొత్త ఫీచర్‌తో అప్‌గ్రేడ్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news