రామ్ గోపాల్ వర్మపై మహిళా న్యాయవాదులు సీరియస్

-

నాగార్జున యూనినర్సీటీలో అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై మహిళా న్యాయవాదులు సీరియస్ అయ్యారు. ఆయనపై గుంటూరు ‌జిల్లా పెదకాకాని పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు మహిళా న్యాయవాదులు. ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. సబ్యత, సంస్కారం లేని వర్మను యూనివర్శిటీ కి ఆహ్వానించిన వీసీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మానసిక రోగి వర్మను యూనివర్సిటీ కు ఎలా పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైరస్ ప్రపంచంలో ఉన్న పురుషలను కాదు వర్మను నిర్మూలిస్తే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుందన్నారు. వావి వరసలు లేని మృగం ఆర్జీవీ అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీని విలాస వస్తువుగా చూసే వర్మపై ఏపీ మహీళా ‌కమీషన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. విద్యార్దుల‌ మెదళ్ళలో విషం నింపిన వ్యక్తి అర్డీవి అని మండిపడ్డారు. మేథావి అంటూ పొగిడిన వీసీ ఆ పదవికి అనర్హుడన్నారు. ఆర్జీవీ, వీసీ పై చర్యలు తీసుకోవాలని మహిళా న్యాయవాదులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుంటూరు మహిళా న్యాయవాదుల సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news