HYD : ఫేస్ బుక్ లో పరిచయం.. నగ్నంగా వీడియోలు.. కట్ చేస్తే మర్డర్..

-

సోషల్ మీడియాలో తెలియని వారితో పరిచయం పెంచుకోవద్దని పోలీసులు చెబుతూనే ఉంటారు.. ఇలా ముక్కు మొహం తెలియని వారితో పరిచయం పెంచుకొని.. చివరికి జీవితాలు అంధకారంలో న నెట్టుకుంటున్నారు. అలాంటి ఘటనే ఇది.. బాగ్ అంబర్‌పేటకు చెందిన యశ్మకుమార్ (32) ఫొటోగ్రాఫర్.. మీర్‌పేట ప్రశాంతిహిల్స్‌కు చెందిన శ్వేతారెడ్డి (32) అనే వివాహితకు 2018లో ఫేస్‌బుక్ ద్వారా అతడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఒకసారి యశ్మకుమార్ కోరిక మేరకు శ్వేత నగ్నంగా వీడియో కాల్ చేసి మాట్లాడింది.

Delhi police arrest one Md Aamir for threatening to upload explicit videos  of a minor

అయితే ఈ నేపథ్యంలో.. గత నెల రోజుల నుంచి శ్వేతకు ఫోన్ చేస్తున్న తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ వీడియోలు, ఫొటోలు అందరికీ షేర్ చేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు యశ్మకుమార్. దీంతో తన గుట్టు బయటపడిపోతుందని భయపడిన శ్వేత తన ప్రియుడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఫేస్‌బుక్‌లోనే పరిచయమైన కృష్ణా జిల్లా తిరువూరు మండలానికి చెందిన మరో ఫ్రెండ్ కొంగల అశోక్ (28)కు ఫోన్ చేసి విషయం చెప్పింది. సరేనన్న అశోక్ ఈ నెల 4న హైదరాబాద్ చేరుకున్నాడు.

అదే రోజు రాత్రి ప్రియుడికి ఫోన్ చేసిన శ్వేతారెడ్డి ప్రశాంతి హిల్స్‌కు రప్పించి విషయాన్ని అశోక్‌కు చేరవేసింది. కార్తీక్ అనే మరో వ్యక్తితో కలిసి యశ్మకుమార్ ఉన్న ప్రదేశానికి వచ్చిన అశోక్ వెనక నుంచి సుత్తితో బాధితుడి తలపై బలంగా మోదాడు. తీవ్రంగా గాయపడిన యశ్మకుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా శ్వేతారెడ్డే ఈ హత్య చేయించిందని తేలింది. దీంతో ఆమెతోపాటు అశోక్, కార్తీక్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news