వావ్; సంక్రాంతి హీరోలకు కెసిఆర్ గుడ్ న్యూస్…!

-

సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే చాలు ఒక్కో సినిమా విడుదల అవుతూనే ఉంటుంది. సెలవలు కావడంతో మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో స్టార్ హీరోలు, చిన్న హీరోలు ఈ సీజన్ లో సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ప్రస్తుత సంక్రాంతి సీజన్ లో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. రజని కాంత్ దర్బార్ విడుదల కాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంది.

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. దీనితో ఈ హీరోల అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. వసూళ్ళ తో పాటు మంచి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. దీనికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకారం అందిస్తున్నారు. ఏపీలో ఆరు షోలకు అనుమతి ఇస్తూ జగన్ ప్రభుత్వం అనుమతించి పర్మిషన్ లెటర్స్ కూడా ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందుకు అనుమతించారు. రాత్రి 1 నుంచి 10 గంటల వరకు ఆరు షోలు ప్రదర్శించుకోవచ్చని అనుమతి ఇచ్చింది కెసిఆర్ సర్కార్. కెసిఆర్ ప్రకటనతో డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ జోష్ లో ఉన్నారు. సంక్రాంతి హీరోలకు ఆరు షో లకు అనుమతి ఇవ్వడంతో పాజిటివ్ టాక్ వస్తే మాత్రం సినిమా భారీ విజయం సాధించడం ఖాయం. దీనితో హీరోల అభిమానులు కెసిఆర్ కి ధన్యవాదాలు చెప్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news