BREAKING : ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత

-

ఈ నెల 25న యాదాద్రి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 8:50 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు.

ఆలయాన్ని మూసివేస్తున్నందున 25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. 26న సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి.

ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇదే.  27 ఏళ్ల తర్వాత దీపావళి రోజునే సూర్యగ్రహణం ఏర్పడడం విశేషం. పాక్షికంగా ఏర్పడనున్న ఈ గ్రహణం యురోపియన్ కంట్రీస్, పశ్చిమ సైబీరియా, మధ్య ఆసియా, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ప్రాంతాలతో పాటు మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం దిల్లీలో కనిపించనుంది. ఈ నెల 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్య గ్రహణం ఏర్పడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news