వృద్ధురాలి మెడలో నుంచి చైన్ చోరీ చేస్తూ దొరికిపోయిన వైసీపీ నాయకుడు

-

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ గాంధీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో ఒంటరిగా ఉంటున్న మస్తానమ్మ అనే వృద్ధురాలి మెడలో మూడున్నర సవర్ల బంగారు గొలుసును ఓ వైసీపీ నాయకుడు చోరీ చేశాడు. వృద్ధురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ద్వారా దొంగను కనిపెట్టి అరెస్టు చేశారు.

నగర పంచాయతీ పరిధి గాంధీనగర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న మస్తానమ్మ మెడలో బంగారు గొలుసును స్థానిక శాంతినగర్‌కు చెందిన బెల్లం అనిల్‌కుమార్‌రెడ్డి దొంగిలించాడని సీఐ కోటేశ్వరరావు వివరించారు. అతను వైకాపా నాయకుడని తెలిపారు. నగర పంచాయతీలో తాత్కాలిక ప్రాతిపదికన శానిటరీ పర్యవేక్షకుడిగా పనిచేసి మానేశాడని చెప్పారు. ఆటో యూనియన్‌ అధ్యక్షుడిగానూ పని చేశాడని వెల్లడించారు.

‘ఇతని భార్య వాలంటీరు. ఈమె పింఛన్లు ఇచ్చే సమయంలో తోడుగా వెళ్లేవాడు. ఆ సమయంలో పింఛను కోసం వచ్చిన వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు ఉండటం గమనించి గురువారం చోరీకి పాల్పడ్డాడు. ప్లోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించినట్లు’ సీఐ కోటేశ్వరరావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news