తలకిందులు తప్పస్సు చేసినా 23 సీట్లు కూడా గెలవరు ; టీడీపీపై రోజా ఫైర్‌

-

మహిళా దినోత్సవం సందర్భంగా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ 160 సీట్లు గెలుచుకుంటుందని.. అచ్చెన్నాయుడు అంటున్నారని.. అది సాధ్యమయ్యే విషయం కాదని చురకులు అంటించారు. టీడీపీ తలకిందులుగా తపస్సు చేసినా.. ఇప్పుడున్న 23 సీట్లు కూడా గెలవలేరని విమర్శలు చేశారు. ప్రజల్లో టీడీపీకి ఏ మాత్రం ఆదరణ ఉందో తెలుసుకోవాలంటే.. అచ్చెన్నాయుడు టెక్కలిలో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు.

సీఎం జగన్ ప్రభుత్వంలో మహిళలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని… పధకాలన్నీ మహిళా లబ్దిదారులకి అందేలా కృషిచేస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగులకి అభినందనలు అన్నారు. నాకు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యలే నాకు అండగా నిలబడ్డారని.. నేను సినిమాలలోకి అడుగు పెట్టేటపుడు నాకు తోడుగా మా అన్నయ్యలు వచ్చేవారని చెప్పారు.

రాజకీయాలలో నన్ను నా భర్త సెల్వమణి ప్రోత్సహించారని… నేను రాజకీయాలలోకి రాణించడానికి నా భర్త ప్రోత్సాహమే కారణమని వెల్లడించారు. ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉన్నది ఎంత నిజమో… ఒక‌ మహిళ విజయం పక్కన కూడా ఒక మగవాడు ఉన్నారన్నారు. మన సేవింగ్స్ లోంచి పది శాతం మహిళల అభివృద్దికి ఖర్చు పెట్టాలని.. మల్టీ టాస్క్ ఒక్క మహిళకే సాధ్యమని చెప్పారు. ఎన్ని విమర్శలు వచ్చినా లక్ష్య సాధనకోసం మహిళలు వెనుకడుగు వేయద్దని వెల్లడించారు రోజా.

Read more RELATED
Recommended to you

Latest news