అటెండర్ నుంచి ఆర్డీవో దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే – సీఎం కేసీఆర్

-

తెలంగాణ రాష్ట్రంలో అటెండర్ పోస్ట్ నుంచి ఆర్డీవో పోస్టు దాకా 95 శాతం ఉద్యోగాలు లోకల్ వారికే వస్తున్నాయని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. జోనల్‌ వ్యవస్థ కారణంగా ఇది సాధ్యం కాబోతుందని చెప్పారు. కాసేటి క్రితమే..తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టమని చెప్పారు.

తెలంగాణ తొలిదశలో ఉద్యమంలో నేనూ కూడా లాఠీదెబ్బలు తిన్నా.. వివక్ష, అన్యాయంతో తెలంగాణ నలిగిపోయిందని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయగా, ఇప్పటివరకు 1.33 లక్షల పోస్టులను భర్తీ చేసిందని ప్రకటన చేశారు. దాదాపు 23,000 పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతోందన్నారు. ఏపీ ప్రభుత్వం తీరు కారణంగా.. ఉద్యోగాలను భర్తీ చేయలేకపోతున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగుల విభజన జరుగలేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news