జగన్ లేఖతో ఆజ్ఞాతంలో చంద్రబాబు…!

-

సీఎం జగన్ సుప్రీం కోర్ట్ సీజే కి లేఖ రాసినప్పటినుంచి చంద్రబాబు ఆజ్ఞాతంలోకి వెళ్ళాడు అన్నారు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. వేల కోట్ల అవినీతి చేసి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు అజ్ఞాతంలో ఏ కుట్రలకు తెర లేపుతున్నారో అనుమానంగా ఉందన్నారు శ్రీకాంత్ రెడ్డి. సీబీఐకి విచారణకు తండ్రి కొడుకులు ఎందుకు జంకుతున్నారు సీబీఐ విచారణ చేస్తే దొంగలెవరో తేలిపోతుందన్నారు.

నిన్న వరదలపై మాట్లాడారు…ఆయన పరిపాలన చేసిన రోజుల్లో కరువులు, వరదలు వచ్చాయి. ఇప్పుడు వర్షాలు సంవృద్దిగా పడటంతో కొంత వరద వచ్చింది. రాష్ట్రంలో రిజర్వాయిర్ లు నిండటంతో తండ్రీ కొడుకులు ఓర్వలేక పోతున్నారన్నారు శ్రీకాంత్ రెడ్డి. లోకేష్ పొలాల్లోకి దిగి ఫొటోలో దిగారు…వరి నాట్లు ఎలా ఉంటాయో కూడా తెలియని ఆయన ఫోటోల కోసమే ఫోజులు ఇచ్చారన్నారు. మా శాసనసభ్యులు అందరూ లోతట్టు ప్రాంతాల్లోనే ఉంది సహాయక చర్యలు చేపడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news