వివేకా కేసులో జగన్‌ ను విచారించాల్సిందే – వైసీపీ ఎంపీ

-

వివేకా కేసులో జగన్‌ ను విచారించాల్సిందేనని నర్సాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ ను సాక్షిగా విచారిస్తే కేసు త్వరగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని నర్సాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

వివేకా హత్య కేసు విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేయడం హర్షించదగ్గ పరిణామమని, ఇకపై విచారణ వేగవంతంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసులో సాక్షాదారాలను ధ్వంసం చేసినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, కుట్ర కోణం దాగి ఉందన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యల నేపథ్యంలో, జగన్ ను విచారించకపోతే కొన్ని అనుమానాలు చరిత్రపుటల్లో అలాగే మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ కేసును సుప్రీం కోర్టు నిన్న తెలంగాణ రాష్ట్రానికి అప్పగించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version