టీడీపీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయి రెడ్డి…!

-

చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు ఎక్కువగా వైసీపీనే కావాలని కక్ష రాజకీయాలను చేసింది అంటూ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు వైసీపీ నేతలు సైతం తగిన సమాదానాలు ఇస్తున్నారు. ఇప్పటికే చాలా సార్లు చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. ఈయన మీడియా ముఖంగా మాట్లాడుతూ… టీడీపీకి లంచాలు తిని కంచాలను మోగించడం అలవాటే అంటూ ఘాటు విమర్శలు చేశాడు. ఈయన మరట్లాడుతూ చంద్రబాబును సరైన మరియు పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేశామని క్లారిటీ ఇచ్చారు. తప్పు చేశారని కోర్టులు కూడా నమ్మాయి కాబట్టి చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్ లు అన్నీ కొట్టివేయబడ్డాయి అంటూ ఉదాహరణ చెప్పాడు విజయసాయి రెడ్డి. ఇక అవినీతి చేసి జైలుకెళ్లిన వారికి మద్దతు పలకడం కరెక్ట్ కాదు అంటూ టీడీపీ నేతలకు మరియు కార్యకర్తలకు అర్థమయ్యేలా తెలియచేశాడు విజయసాయి రెడ్డి.

ఢిల్లీ కెళ్లిన లోకేష్ చంద్రబాబును విడుదల చేయించడం కాదు కదా.. ఈడీ ఆఫీస్ ముందు ప్లేట్లు మరియు గ్లాసులు శబ్దం చేయాల్సిందే అంటూ ఘాటుగా విమర్శించారు విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version