‘ద్రోహం’కు పర్యాయ పదం చంద్రబాబు..లోకేష్ ఓ అజ్ఞాని : విజయసాయి రెడ్డి

-

టిడిపి అధినేత చంద్రబాబును మరోసారి వైసీపీ రాజ్య సభ సభ్యలు విజయసాయి రెడ్డి టార్గెట్ చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యే… 3 సార్లు సిఎం పదవి అనుభవించిన చంద్రబాబు వంగి వంగి దండాలు పెట్టినా కుప్పం ప్రజానీకం కనికరించని పరిస్థితి ఉందంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ‘ద్రోహం’ అనే పదానికి పర్యాయ పదం అయ్యాడని.. ఇప్పుడు కుప్పంలో చమటలు కక్కుతున్నాడని మండిపడ్డారు.

జగన్ గారి సంక్షేమ పాలనలో గల్లంతైన అడ్రసును వెతుక్కుంటున్నావా బాబూ? అంటూ చురకలు అంటించారు. చిత్తుగా ఓడినప్పుడల్లా బాబు ఒక కొత్త థియరీ చెబుతాడని… ఓటమి ఖాయమని అర్థమైన వెంటనే థియరీల పుస్తకాన్ని దుమ్ము దులిపి బయటకు తీస్తాడని ఫైర్ అయ్యారు. ఈవీఎంలు మీదకు నెడతాడని.. . అధికార దుర్వినియోగం, రౌడీయిజం చేసి గెలిచారంటాడు… ప్రజలు తరిమి కొట్టారన్న వాస్తవాన్ని మాత్రం చచ్చినా అంగీకరించడంటూ ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి. ఇక చంద్రబాబు కోడుకు నారా లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ రెచ్చిపోయారు. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియని నాయకూడని.. ఎద్దేవా చేశారు విజయసాయి రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news