నేతి బీరకాయలో నేతి లేనట్లు.. మంత్రి హరీష్ రావుకు నీతి లేదు – యెండల లక్ష్మీనారాయణ

-

ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సిద్దిపేటలో మోడీ 20 ఏళ్ల పాలన పై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ రైతు బందు పథకం పెట్టకముందు రైతులకు ఎన్నో సబ్సిడీ లు ఉండేవని.. ఇప్పుడు అవి బందు చేశారని ఆరోపించారు.

వడ్లు కొనేది కెసిఆర్ కాదు ఎఫ్సీఐ అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే కమిషన్ లతోనే కొనుగోలు కేంద్రాలు నడుస్తున్నాయన్నారు. కేంద్రం డబ్బులు ఇచ్చినా కూడా కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ పనులు నత్త నడకన నడుస్తున్నాయని ఆరోపించారు. నేతి బీరకాయ లో నేతి లేనట్లు.. మంత్రి హరీష్ రావు కి నీతి లేదని మండిపడ్డారు. కేంద్రం సహకారంతోనే రాష్ట్రంలో కెసిఆర్ 24గంటల కరెంట్ ఇస్తున్నాడని అన్నారు. కేంద్ర నిధులతో చేపట్టే పనులకు టిఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుందని రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news