గిరిజన రిజర్వేషన్ల బిల్లును కేంద్రానికి తెలంగాణ పంపింది : ఈటల సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గిరిజనుల రిజర్వేషన్‌ల పెంపు బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందని ఈటెల రాజేందర్ కామెంట్ చేశారు. అయితే ఈ బిల్లు కేంద్రానికి పంపలేదని నిన్న పార్లమెంట్ కేంద్ర మంత్రి ప్రకటన చేశారు.

 

దీంతో బీజేపీ పార్టీ లో హాట్‌ టాపిక్‌గా మారాయి ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు. ఇక పార్లమెంట్లో నిన్న కేంద్ర మంత్రి తుడు చేసిన ప్రకటన కు నిరసనగా హైదరాబాద్లోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి గిరిజన సంఘాలు ప్రయత్నించాయి.

భారీగా తరలి వచ్చిన గిరిజనులు కార్యాలయాన్ని ముట్టడించి చేసే ప్రయత్నం చేశారు. గిరిజన రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు గిరిజనులు ప్రయత్నం చేశారు. అయితే వీరిని అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. గిరిజనులకు… వ్యతిరేకంగా బిజెపి పార్టీ నాయకులు కూడా వాగ్వాదానికి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news