తెలంగాణలో దారుణం..కోడిగుడ్ల కూర వండలేదని యువకుడు ఆత్మహత్య

-

కోడి కూర వండ లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. మనోహరాబాద్ లోని రంగాయపల్లికి చెందిన నరసింహులు, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు. అందులో చిన్న కొడుకు మములేష్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడగా భుజానికి గాయమైంది.

దీంతో కొన్ని రోజులుగా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అతని తల్లి సుశీలను కోడిగుడ్డు కూర వండాలి అని కోరాడు. ఇంట్లో గుడ్లు లేవని ఇప్పుడు ఉండలేనని ఆమె చెప్పడంతో తల్లి తో వాగ్వాదానికి దిగిన ఇంట్లో ఉంచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు.

ఎంతకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో అన్ని చోట్లా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం ఉదయం గ్రామ సమీపంలోని మహంకాళి దేవాలయం దగ్గర పొలం లో చుట్టు కరెంటు తీగలు తో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు గుర్తించారు స్థానికులు. ఈ మేరకు తండ్రి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news