నిశ్చితార్థం రోజే యువకుడి మృతి..హత్య? ఆత్మహత్య?

-

నిశ్చితార్థం జరగాల్సిన రోజే అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు యువకుడు.జోగిపేట ఎస్సై సామ్యనాయక్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…మెదక్ జిల్లా టేక్మాల్ కు చెందిన గుంజి బాలరాజ్(25) ఆయన సోదరుడు శంకర్ ఏడాదిగా అదే మండలంలోని పాల్వంచ సోలార్ ప్లాంట్ లో పని చేస్తున్నారు.బాలరాజ్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.ఆదివారం అర్ధరాత్రి వరకు విధి నిర్వహణ లోనే ఉన్న బాలరాజ్ సోమవారం ఉదయానికల్లా సంగారెడ్డి జిల్లా ఆందోలు మండలం దానం పల్లి శివారులో ఓ విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని కనిపించాడు.సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్ళి వివరాలు సేకరించారు.బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడికి చేరుకుని బోరున విలపించారు.శుభకార్యం జరగవలసిన ఇంట్లో విషాదం నెలకొంది అని కన్నీటిపర్యంతమయ్యారు.మృతుడి సోదరుడు శంకర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.విధి నిర్వహణలో భాగంగా సోలార్ ప్లాంట్ లో పనిచేస్తున్న బాలరాజుకు అదే ప్లాంట్ లో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి తో వారం రోజుల క్రితం గొడవ చోటు చేసుకుంది.ఈ వివాదం నేపథ్యంలోనే హత్య చేసి స్తంభానికివేలాడదీసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news