నిమజ్జనంలో అపశ్రుతి.. లారీ కిందపడి యువకుడు మృతి

-

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన వేడుకలు ఇంకా కొనసాగుతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో వివాయక ప్రతిమలను భక్తులు గంగమ్మ ఒడికి చేర్చారు. ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్ సాగర్‌లో ఇవాళ కూడా గణేశ్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయి. బ్యాండ్ బాజాలతో, డ్యాన్సులు చేస్తూ కోలాహలంగా, వైభవంగా గణపయ్యకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న గణపతి నిమజ్జనవేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ వెనుక చక్రాల కింద ప్రమాదవశాత్తు పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. నగరంలోని శాలిబండ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు జైసాయి శుక్రవారం తెల్లవారుజామున గణేశ్‌ నిమజ్జనం ముగించుకొని లారీపై ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో అబిడ్స్ చర్మాస్ వద్దకు రాగానే లారీ పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెనుక చక్రాలు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న అబిడ్స్ పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news